Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నెట్స్‌లో ధోనీ, రైనా వీర బాదుడు

దుబాయ్‌: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 14వ సీజన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లు ఆడటానికి దుబాయ్‌ వెళ్లిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ అప్పుడే ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు ధోనీ, రైనా, అంబటి రాయుడు నెట్‌ ప్రాక్టీస్‌ చేశారు. ముగ్గురూ బ్యాట్స్‌మెన్‌ భారీ షాట్లు ఆడుతూ.. మంచి టచ్‌లో కనిపించారు. సెప్టెంబర్‌ 19న చెన్నై, ముంబై మ్యాచ్‌తో ఐపీఎల్‌ తిరిగి ప్రారంభం కానుంది. ధోనీ, రైనా, రాయుడు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో చెన్నై పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్నా.. ధోనీ, రైనా పెద్దగా ఆడిరది లేదు. దీంతో ఈ ఇద్దరూ తదుపరి మ్యాచ్‌లలో రాణించాలన్న పట్టుదలతో ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌ మిగిలిన టోర్నీకి అందుబాటులో ఉంటారని చెన్నై జట్టు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img