Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేడు ఐపీఎల్‌ రెండో క్వాలిఫయర్‌

వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే గుజరాత్‌కే ఫైనల్‌ అవకాశం

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ గుజరాత్‌ టైటాన్స్‌ముంబై ఇండియన్స్‌ మధ్య జరగనుంది. బుధవారం జరిగిన తొలి ఎలిమినేటర్‌లో ముంబై...లక్నో జట్టును ఓడిరచి, తర్వాతి రౌండ్‌లో ఆడే అవకాశం దక్కించుకుంది. మే 26, శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ భారీ మ్యాచ్‌లో విజయం కోసం ఇరుజట్లు తీవ్రంగా పోరాడతాయనడంలో ఎలాంటి సందేహం లేకపోయినప్పటికీ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే మాత్రం ఫైనల్‌లో సీఎస్‌కేతో ఏ జట్టు ఆడుతుందనే సందిగ్ధం నెలకొంది. అయితే, ఇందుకోసం కొన్ని నియమాలు కూడా నిర్ణయించారు కాబట్టి ఇలాంటి సమయంలో ఏ జట్టుకు ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్‌లో లీగ్‌ రౌండ్‌లో మ్యాచ్‌ రద్దు అయితే, రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ ఇవ్వను న్నారు. అయితే ప్లేఆఫ్‌ మ్యాచ్‌ లకు ఐపీఎల్‌ నిబంధనలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా క్వాలిఫయర్లు రద్దయితే… ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్లో సీఎస్‌కేతో ఆడే అవకాశం ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే లీగ్‌ టేబుల్‌లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌లో ఆడుతుంది. ఐపీఎల్‌ లీగ్‌ రౌండ్‌లో 10 మ్యాచ్‌లు గెలిచిన గుజరాత్‌ జట్టు 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. ముంబై 14 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు గెలిచి 16 పాయింట్లు మాత్రమే సాధించింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా క్వాలిఫయర్‌-2 రద్దయితే గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు ఆఖరి రౌండ్‌లో ఆడుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img