Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పంత్‌, బుమ్రా లేకపోవడం లోటే: ఛాపెల్‌

ముంబై: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఫలానా జట్టుదే గెలుపు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు అంచనా వేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే రెండు జట్లూ సాధన మొదలుపెట్టేశాయి. మరోవైపు మాటల యుద్ధం కూడా మొదలైంది. భారత్‌ను కవ్వించడానికి అవసరమైన ప్రయోగాలన్నీ ఆసీస్‌ ఆటగాళ్లు, మాజీలు ప్రారంభించారు. తాజాగా టీమిండియాకు కోచ్‌గా పని చేసిన క్రికెట్‌ దిగ్గజం గ్రెగ్‌ ఛాపెల్‌ కూడా తన విశ్లేషణ ఏంటో చెప్పాడు. ఆస్ట్రే లియా తప్పకుండా విజయం సాధిస్తుం దని వ్యాఖ్యానించిన గ్రెగ్‌.. దానికి కారణం ఏంటో కూడా తెలిపాడు. ‘అవును. టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది. అదీనూ భారత్‌ను వారి సొంత దేశంలోనే ఢీకొట్టి మరీ గెలుస్తుంది. దీనికి కారణం ఆ జట్టులో రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రాతోపాటు రవీంద్ర జడేజా అందుబాటులో లేకపోవడమే. ఇప్పుడు టీమిండియా ఎక్కువగా విరాట్‌ కోహ్లిపైనే ఆశలు పెట్టుకొంది. అందుకే ఈసారి భారత్‌ చాలా బలహీనమైన జట్టుగా కనిపిస్తోంది. పర్యటనకు వచ్చే జట్లు పేస్‌ అనే పిచ్చితనంతో తరచూ అవివేకంగా మారుతు న్నాయి. భారత్‌ ఇలాంటి పరిస్థితులను ఆకళింపు చేసుకొంది. అందుకే ఆసీస్‌ కూడా బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు మానసికంగానూ త్వరగా అల వాటు పడిపోవాలి’ ‘భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలమని అందరికీ తెలుసు. అందుకే నాథన్‌ లియాన్‌కు పార్టనర్‌గా ఆష్టన్‌ అగర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. తప్పకుండా ప్రభావం చూపుతాడనే భావిస్తున్నా. టీమిండియా క్రికెట్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే కూడా ఇలానే వికెట్లు పడగొట్టాడు. అతడు సంధించే ఫ్లాట్‌ లెగ్‌బ్రేక్‌లు బ్యాటర్లకు ప్రమాదకరంగా ఉండేవి. బంతిని మిస్‌ అయితే దాదాపు వికెట్‌ పడినట్లే లెక్క. ఇప్పుడు రవీంద్ర జడేజా బౌలింగ్‌లోనూ ఇదే తీరు కనిపిస్తోంది’ అని చెప్పాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img