Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బ్యాడ్మింటన్‌ దిగ్గజం నందు నటేకర్‌ కన్నుమూత

న్యూదిల్లీ : భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం నందు నటేకర్‌ బుధవారం ఉదయం కన్నుమూశారు. 88 ఏళ్ల నందు బ్యాడ్మింటన్‌ కోర్టులో వీరోచితంగా ఆడి పలు విజయాలు సాధించారు. 1956లో మలేషియాలో సెల్లంజర్‌ అంతర్జాతీయ టోర్నమెంటులో విజయం సాధించారు. 1950లో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఒపెన్‌ లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. బ్యాడ్మింటన్‌లో నందు సాధించిన విజయాలకు కేంద్ర ప్రభుత్వం 1961లో అర్జున అవార్డును ప్రదానం చేసింది. 1965లో జమైకాలో జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడల్లో నందు నటేకర్‌ భారత్‌ కు ప్రాతినిథ్యం వహించారు. నటేకర్‌ కుమారుడు గౌరవ్‌ భారత టెన్నిస్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. గౌరవ్‌ 1994లో హిరోషిమా ఆసియన్‌ క్రీడల్లో బంగారు పతకం సాధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img