దుబాయ్: ఐపీఎల్`2021లో భాగంగా ఇక్కడి దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బుధవారం రాత్రి జరిగిన టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బెంగళూరు జట్టుకు 150 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బ్యాట్స్మెన్ లూయిస్ (58), జైస్వాల్ (31)ఆకట్టుకున్నారు. టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్కు అదిరిపోయే శుభారంభం లభించింది. ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్.. ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడిగి దిగారు. లూయిస్ ఎడాపెడా బౌండరీలు బాదగా.. జైస్వాల్ అతడికి మద్దతుగా నిలిచాడు. దీంతో తొలి పవర్ ప్లేలోనే 56 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్ జోరుగా సాగుతున్న క్రమంలో వీరి 77 పరుగుల భాగస్వామ్యానికి క్రిస్టియన్ తెరదించాడు. జైస్వాల్ను బోల్తా కొట్టించాడు. కాసేపటికి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న లూయిస్ ను గార్టన్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత వచ్చిన శాంసన్ (19), మహిపాల్ (3), తెవాటియా (2), లివింగ్స్టోన్ (6) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. చివర్లో మోరిస్ (14) కాసేపు పోరాడినా ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల పరుగులు రావడం కష్టమైంది. రాజస్థాన్ చివరికి 9 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేయగలి గింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చాహల్, షాబాజ్ అహ్మద్ రెండేసి వికెట్లు, గార్టన్, క్రిస్టియన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఐపీఎల్కు అర్జున్ టెండూల్కర్ దూరం
ముంబై : టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021కు దూరమయ్యాడు. దీంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అర్జున్ లీగ్ నుంచి వైదొలిగాడు. ఇతడి స్థానంలో యువ పేసర్ సిమర్జీత్సింగ్ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. ఈ ఏడాది వేలంలో కనీస ధర రూ.20 లక్షలకు అర్జున్ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో ఇతడికి ఒక్క మ్యాచ్లో అయినా ఆడే అవకాశం వస్తుందని అంతా భావించారు. ముంబై ప్లే ఆఫ్స్ రేసులో ముందుంటే యువ ఆటగాళ్లకు అవకాశం వచ్చేది. ఆ సమయంలో అర్జున్ను కూడా ఓ మ్యాచ్ ఆడిరచే వీలుండేది. కానీ ముంబై వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనుకపడటంతో అర్జున్కు నిరాశ తప్పలేదు.