భారత్ రెండో ఇన్నింగ్స్ 466
ఇంగ్లాండ్కు 368 పరుగుల లక్ష్యం
లండన్ : భారత్`ఇంగ్లాండ్ మధ్య ఓవల్లో జరుగుతున్న నాలుగో టెస్టు రసకందాయంలో పడిరది. ఆదివారం నాలుగోరోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 466 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఎదుట 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సోమవారం ఆటకు చివరిరోజు.
పంత్- శార్దుల్ ధనాధన్
లంచ్కి ముందు విరాట్, రహానే ఔట్ అవ్వడం వల్ల పంత్ మీదే భారం పడిరది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న పంత్(50) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక శార్దుల్ ఠాకుర్(60) మరోసారి రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇద్దరూ విలువైన భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. ఈ క్రమంలో శార్దుల్ను రూట్ ఔట్ చేయగా.. పంత్ భారీ షాట్కు ప్రయత్నించి మోయిన్ అలీకి చిక్కాడు ఇక చేతిలో మిగిలింది రెండు వికెట్లే. టీమిండియాను తొందరగా ఆలౌట్ చేద్దామని ఇంగ్లాండ్ భావించినా.. అది జరగలేదు. క్రీజులోకి వచ్చిన ఉమేశ్(25), బుమ్రా(24) కూడా ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యాన్ని చెలాయించారు. ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.అటు ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్ 2, క్రిస్ ఓక్స్ 3, మోయిన్ అలీ 2, ఓవర్టన్, రూట్, ఆండర్సన్ తలో వికెట్టు పడగొట్టారు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 191 చేయగా, ఇంగ్లాండ్ 290 పరుగులు చేసింది.