కొలంబో : భారత్`శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన రీ షెడ్యూల్ మ్యాచ్లో శ్రీలంక జట్టు విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో మ్యాచ్ గురువారం రాత్రి జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. బదులుగా శ్రీలంక మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. లంక విజయంలో మినోద్ భానుక (36), దనంజయ డి సిల్వా (40-నాటౌట్) ప్రధాన భూమిక పోషించారు. అవిష్క ఫెర్నాం డో 11, హసరంగ 15, చమిక కరుణరత్నె 12 (నాటౌట్) పరు గులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడ గొట్టగా, భువనేశ్వర్ కుమార్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో భారత జట్టు పలు మార్పు లతో బరిలోకి దిగింది. ఓపెనర్ పృథ్వీషా, సూర్య కుమార్ యాదవ్ ఇంగ్లండ్ వెళ్లి పోవడం, కృనాల్ పాండ్యా కరోనాతో జట్టుకు దూరం కావడం, అతడితో సన్ని హితంగా మెలిగిన మరి కొందరిని దూరం పెట్టడంతో జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా, నితీశ్ రాణాలు ఈ మ్యాచ్తో టీ20ల్లో అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. కొత్త కుర్రాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (21), దేవదత్ పడిక్కల్ (29) పర్వాలేదనిపించినా నితీశ్ రాణా (9) సంజు శాంసన్ (7) దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ థావన్ 40 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో దనంజయ 2, చమీర, హసరంగ, దాసున్ శనక చెరో వికెట్ తీసుకున్నా రు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డి సిల్వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.