Friday, April 19, 2024
Friday, April 19, 2024

వింబుల్డన్‌ విజేత బార్టీ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ కైవసం

లండన్‌:
వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా టాప్‌ సీడ్‌ ఆస్ట్రేలియా క్రీడాకా రిణి ఆష్లే బార్టీ నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ తుది పోరులో బార్టీ.. చెక్‌ రిపబ్లిక్‌కి చెందిన ప్లిస్కోవాపై 6-3, 6-7 (4/7), 6-3 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో బార్టీ ఖాతాలో రెండో గ్రాండ్‌స్లాం చేరింది. తొలి సెట్‌ను బార్టీ అలవోకగా సొంతం చేసుకుంది. రెండో సెట్‌ను ప్లిస్కోవా ట్రైబేకర్‌ ద్వారా సొంతం చేసుకుంది. మూడో సెట్‌లో బార్టీ పైచేయి సాధించి 6`3 తేడాతో సెట్‌తో పాటు చాంపియన్‌ షిప్‌ను సొంతం చేసుకుని తొలి వింబుల్డన్‌ను తన ఖాతాలో వేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img