దుబాయ్ : చెన్నై సూపర్ కింగ్స్పై అద్భుత విజయం సాధించాం.. ఇది కచ్చితంగా తాము టాప్`2లో నిలి చేలా చేస్తుందని దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. సోమ వారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్లో ధోనీసేన నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో దిల్లీ పది విజయాలతో అగ్రస్థానంలో నిలి చింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనం తరం పంత్ మాట్లాడుతూ .. ‘ఇది నా పుట్టినరోజు (అక్టోబర్ 4) కానుక కాదు. ఇదో కష్టత రమైన మ్యాచ్. చివరికి మేం గెలిచినందుకు సంతోషంగా ఉంది’ అన్నాడు.. ఇది మాకు చాలా పెద్ద విజయం. ఎందుకంటే ఇది మమ్మల్ని కచ్చితంగా టాప్ 2లో నిలి చేలా చేస్తుంది’ అని పంత్ వివరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ.. ‘‘మేం బ్యాటింగ్ చేసేటప్పుడు స్కోర్ బోర్డుపై 150 పరుగులు సాధిం చాలనుకున్నాం. కానీ, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దీంతో ధాటిగా ఆడలేక విఫల మయ్యాం. చివరికి 15-16 ఓవర్ల తర్వాత పిచ్ అనుకూలంగా మారడం వల్ల రాయుడు బాగా ఆడాడు. ఏమైనా జట్టు స్కోర్ 150 పరుగుల దాకా ఉంటే బాగుండేది. పోరాడటానికి వీలుండేది. కాగా, ఈ పిచ్ రెండు విధాలుగా ఉంది. మరీ నెమ్మదిగా లేదు. అలా అని షాట్లూ ఆడలేము. దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్కు కూడా ఇలాగే జరిగింది. ఇది ఎత్తుగా ఉన్న బౌలర్లకు అనుకూలమైన వికెట్ అని చెప్పొచ్చు’ అన్నాడు. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.