Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సెమీస్‌లో సింధు ఓటమి

టోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో సెమీస్‌కి దూసుకొచ్చిన పీవీ సింధు తైజుయింగ్‌ చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో 18-21, రెండో గేమ్‌లో 12-21 తేడాతో తైజు చేతిలో ఓడిపోయింది. మ్యాచ్‌ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి విరామం తర్వాత వెనుకంజలో పడిరది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తై జు తర్వాత సింధూకూ గట్టి పోటీ ఇచ్చింది. చివరికి తొలి గేమ్‌ను 21-18తో కైవసం చేసుకుంది. అపై మరింత పట్టుదలగా ఆడిన ఆమె రెండో గేమ్‌లోనూ ఏ అవకాశం ఇవ్వలేదు. చివరికి సింధు ఓటమిపాలవ్వక తప్పలేదు. అయితే కాంస్య పతకం కోసం చైనా షట్లర్‌ హి బింగ్జియావోతో పీవీ సింధు ఆదివారం సాయంత్రం తలపడనుంది.2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరిన పీవీ సింధు రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img