టోక్యో ఒలింపిక్స్లో వరుస విజయాలతో సెమీస్కి దూసుకొచ్చిన పీవీ సింధు తైజుయింగ్ చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్లో 18-21, రెండో గేమ్లో 12-21 తేడాతో తైజు చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి విరామం తర్వాత వెనుకంజలో పడిరది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తై జు తర్వాత సింధూకూ గట్టి పోటీ ఇచ్చింది. చివరికి తొలి గేమ్ను 21-18తో కైవసం చేసుకుంది. అపై మరింత పట్టుదలగా ఆడిన ఆమె రెండో గేమ్లోనూ ఏ అవకాశం ఇవ్వలేదు. చివరికి సింధు ఓటమిపాలవ్వక తప్పలేదు. అయితే కాంస్య పతకం కోసం చైనా షట్లర్ హి బింగ్జియావోతో పీవీ సింధు ఆదివారం సాయంత్రం తలపడనుంది.2016 రియో ఒలింపిక్స్లో ఫైనల్కి చేరిన పీవీ సింధు రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.