హైదరాబాద్: సెయిలింగ్ చాలా క్లిష్టమైన క్రీడ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. హుస్సేన్ సాగర్లో జాతీయ 35వ సెయిలింగ్ పోటీలను గవర్నర్ ప్రారంభించారు. గాలివేగాన్ని క్రీడాకారులు తమకు అనుకూలంగా ములుచుకొని ఎదురు ఈదుతూ ముందుకు సాగుతారని పేర్కొన్నారు. సెయిలింగ్ క్రీడలాగే జీవితంలో కష్టాలకు వెరవకూడదన్నారు. జాతీయ స్థాయి పోటీలకు దేశం నలుమూలల నుంచి వచ్చిన సెయిలర్లను గవర్నర్ అభినందించారు. భవిష్యత్తులో మంచి శిక్షణ తీసుకొని దేశానికి పతకాలు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ఒలింపిక్స్ సెయిలింగ్లో పతకాలు సాధించిన క్రీడాకారులు నేత్ర కుమరన్, విష్ణు శరవణన్ను ఈ సందర్భంగా గవర్నర్ సత్కరించారు. అనంతరం హుస్సేన్ సాగర్ను శుభ్రం చేసి జంట నగరాల ప్రజలకు అవగాహన కల్పించారు.