న్యూదిల్లీ: ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం కోసం ఐదేళ్లు ఎదురు చూశానని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చెప్పింది. శనివారం ప్రొ వాలీబాల్ లీగ్ ఆరంభానికి అతిథిగా వచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడిరది. ‘‘ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం చాలా పెద్ద ఘనత. ఒలింపిక్స్ పతకం తర్వాత అంతటి ఆనందం ఈ టోర్నీ గెలవడంతోనే వచ్చింది. ఎందుకంటే ఈ స్వర్ణం కోసం ఐదేళ్లు ఎదురు చూశా. అంతకుముందు రెండు రజతాలు, రెండు కాంస్యాలు గెలిచా. చివరికి 2019లో ప్రపంచ చాంపియన్ని అయ్యా’’ అని సింధు తెలిపింది. 2013, 14 ప్రపంచ చాంపియన్షిప్లలో కాంస్యాలు నెగ్గిన సింధు.. 2017, 18లో రజతాలు సొంతం చేసుకుంది. 2019 టోర్నీ ఫైనల్లో జపాన్ స్టార్ నవోమి ఒకుహరపై నెగ్గి విజేతగా నిలిచింది.