హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్పై వేటు పడిరది. ఈ మేరకు హెచ్సీఏ ఓటర్ల జాబితా నుండి అజహర్ పేరును తొలగిస్తూ జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఇప్పుడు అజహర్ హెచ్సీఏ జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతను కోల్పోయాడు. అజహర్ గతంలో హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్కు ప్రెసిడెంట్గా వ్యవహరించారని… అందుకే అనర్హత వేటు వేసినట్లు కమిటీ పేర్కొంది.