విశాలాంధ్ర -ధర్మవరం : డోలా రాజారెడ్డి వివిధ సేవా కార్యక్రమాలను చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకొని తగిన ఆర్థిక సహాయమును అందించి మానవతను చాటుకుంటున్నారు. ఇప్పటికే వందలాదిమందికి తన సహాయ సహకారాలను అనేక రూపాలుగా అందిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇందులో భాగంగా వారు పట్టణంలోని ధన్వంతరి వైద్య నారాయణ త్యాగరాజస్వామి ఆలయ నిర్మాణం కొరకు ఆలయ కమిటీకి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. డోల రాజారెడ్డి మాట్లాడుతూ భగవంతుడు నాకిచ్చిన దానిలో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం నాకెంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుందన్నారు. చదువు విషయంలో పేద వాళ్లకు కూడా తాను సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. పేదరికానికి చదువు ఎప్పుడూ కూడా అడ్డు కాకూడదు అన్న ఉద్దేశంతో తాను ఆలయాలకు, విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ వారు డోరా రాజారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.