Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలి

వైసీపీ యువ నాయకులు చిరంజీవి నాగ్

విశాలాంధ్ర -పొందూరు: ఉత్తరాంధ్ర అభివృద్ధి పదం వైపు నడవాలన్నా, వలస వెళ్లిన రైతు కూలీలు మళ్లీ తిరిగి వచ్చి జిల్లాలో హాయిగా బ్రతకాలన్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి సీతశీరాజు సుధాకర్ ని గెలిపించాలని వైయస్సార్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి పేర్కొన్నారు. శనివారం పొందూరు జేవియర్ ఫంక్షన్ హాల్లో పొందూరు మండల క్యాడర్ తో ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ క్యాడర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలన్న నిరుద్యోగం పోవాలన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించడం చారిత్రక అవసరమని చిరంజీవి నాగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గ పరిశీలకులు ఎం ఎల్ సి ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటర్ని బూత్ కు తీసుకు వెళ్లి ఓటు పడే విధంగా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క బూత్ కమిటీ సభ్యులపై ఉందని ఆయన అన్నారు. మొదట ప్రాధాన్యత ఓటు పడేవిధంగా ప్రతి ఓటర్ కి వివరించి ఓటు పడే విధంగా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, జెడ్పీటీసీ లోలుగు కాంతరావు, మండల,టౌన్ పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్ కుమార్, గాడు నాగరాజు, పి ఎ సి ఎస్ అధ్యక్షులు కొంచాడ రమణ మూర్తి, వైస్ ఎంపీపీ వండాన వెంకటరావు,కాకర్ల రాజారావు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు బడాన సునీల్, సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img