Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రూ. 20లక్షల విలువ గల మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన జిల్లా పోలీసులు

-లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వార 150 ఫోన్లు రికవరీ

-మలేషియా నుంచి సెల్ ఫోన్ ని రికవరీ చేసిన సైబర్ సెల్ సిబ్బంది

  • బాధితులకు అందించిన జిల్లా ఎస్పీ జీ అర్ రాధిక

విశాలాంధ్ర – శ్రీకాకుళం: సుమారు 20లక్షల రూపాయల విలువ గల్గిన 150 మొబైల్ ఫోన్లు శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ వెబ్ సైట్ ఁలాస్ట్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ఁ ద్వార ఫోన్లు గుర్తించి,ఆయా రికవరీ చేసిన ఫోన్లు బాధితులకు జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు.
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ పోగొట్టుకున్న బాధితుల పోలీసు స్టేషన్లు కు వెళ్లే పనిలేకుండా జిల్లా ఐటి కోర్ టీమ్ రూపకల్పన చేసిన http://srikakulampolice.in/mobiletrackupload.html అధికార వెబ్సైట్ నందు పోగొట్టుకున్న ఫోన్ యొక్క సమాచారాన్ని బాధితులు రిజిస్ట్రేషన్ చేయడంతో జిల్లా సైబర్ సెల్ సిబ్బంది 150 ఫోన్లును గుర్తించారు.ఈ మేరకు బాధితులు అందరిని శనివారం జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి అయా ఫోన్లును ఎస్పీ చేతులు మీదుగా అందజేసారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లో సెక్యూరిటీ లాకింగ్ లేకుండా ఎటువంటి విలువైన వ్యక్తిగత సమాచారాన్ని ఉంచరా దని సూచించారు. క్రెడిట్ కార్డు, ఏటీఎం పిన్ నెంబర్లు,నెట్ బ్యాంకింగ్ అట్టి వాటికి భద్రత పరమైన లాకింగ్ ప్రతి ఒక్కరూ తప్పకుండా వెసుకోవలన్నారు. మీరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు కొంతమంది తక్కువ ధరలకు ఇతరులకు అమ్మి వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇలా మన జిల్లా,రాష్ట్రం,దేశంలోని కాకుండా కాకుండా ఇతర దేశాలలో నుంచి కూడా ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. కావున మొబైల్ ఫోన్లు పోయినట్లు అయితే తక్షణమే శ్రీకాకుళం జిల్లా మొబైల్ లాస్ట్ ట్రాకింగ్ సిస్టం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా తక్కువ కాలంలోనే మీ ఫోన్లు రికవరి చేయడడానికి అవకాశం ఉందన్నారు. గతంలో రూ.12.50 లక్షల విలువైన 130 మొబైల్ ఫోన్లను అందజేశామని,ఇప్పటివరకు 2 విడతల్లో కలిపి రూ.32,50,000లు విలువగల మొత్తం 280 ఫోన్లు బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. మిగతా ఫోన్లు కూడా వీలైనంత త్వరగా రికవరీ చేసి బాధితులకు అందజేసేలా కృషి చేస్తామని ఎస్పీ అన్నారు. సరైన పత్రాలు లేకుండా ఎవరూ మొబైల్ ఫోన్స్ కొనవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు. అతి తక్కువ కాలంలోనే ఫోన్లు రికవరీ చేసి తమకు అందచేయడంతో బాధితులు జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఫోన్లు రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ సెల్ సిబ్బందిను జిల్లా ఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టిపి విఠలేశ్వర్,ఎస్ఐ ప్రసాదరావు, ఏఎస్ఐ బి రమేశ్,సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img