Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మండలంలో పంట పొలాల్లో ఉన్న ఏనుగుల గుంపు

విశాలాంధ్ర, సీతానగరం: ఏనుగులగుంపు సీతానగరం మండలములో అనంతరాయుడుపేట గ్రామానికి దగ్గరలో రైతులపంటపొలాల్లో శుక్రవారం ఉదయం నుంచి తిష్టవేసిఉన్నాయి. ఐదోరోజు కూడా మండలంలో ఉండటంతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిపంట, చెరకు పంట, అరటి తోటలు నాశనం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రజలు, సందర్శకులు ఏనుగులు వద్దకు రావద్దని అటవీశాఖ,పోలీస్ సిబ్బంది విజ్ఞప్తి చేస్తూ కాస్తున్నారు. ఏడు ఏనుగులు కలసి ఉండి పంటలను కుమ్మివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈప్రాంతంనుండి ఏనుగులను తక్షణమే తరలించాలని రైతులు కోరుతున్నారు. పంటలు చేతికి వచ్చే సమయంలో ఏనుగులు వల్ల రైతులకు నష్టం జరుగుతుందని రైతులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img