Monday, March 27, 2023
Monday, March 27, 2023

ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లా కలెక్టరు, ఎస్పీలు

విశాలాంధ్ర,పార్వతీపురం: పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పార్వతీపురం మన్యంజిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ , ఎస్పీ విద్యాసాగర్ నాయుడులు తెలిపారు.విశాఖపట్నం – విజయనగరం – శ్రీకాకుళంజిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర సర్వే కమీషనర్ సిద్ధార్థజైన్ సోమవారం విశాఖపట్నం నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ సిబ్బందిని గుర్తించామని, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సూక్ష్మపరిశీలకులుగా కేంద్ర ప్రభుత్వరంగంలో పనిచేసే వ్యక్తులను నియమించి ఒకదశశిక్షణ పూర్తిచేశామని చెప్పారు. ప్రతి విభాగానికి ఒకనోడల్ అధికారిని నియమించామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు బృందాలను నియమించామని చెప్పారు. పోలింగ్ బాక్సులను ఇప్పటికే ఒకసారి పరిశీలన చేసామని తెలిపారు. వచ్చేనెల 12న ఎన్నికల సామగ్రి పంపిణీ, ఎన్నికల అనంతరం సామగ్రి స్వీకరణ (రిసెప్షన్) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
జిల్లా పోలీసుసూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో 8 పోలింగుకేంద్రాలు సున్నితమైన కేంద్రాలుగా పరిగణిస్తున్నామన్నారు.

ఎన్నికలపరిశీలకులు సిద్ధార్థ జైన్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరుగుటకు అందరూ చక్కటి సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి పట్టభద్రుడు ఓటువేయాలని ఆయన కోరారు. అవసరమగు పోలీస్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని ఆయన సూచించారు. 37మంది అభ్యర్థులు పోటీలోఉన్నారని, బ్యాలెట్ పత్రం తయారీ, రవాణా, ఓటింగ్ తదితర అంశాలపై జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. పొలింగకు 48 గంటల ముందునుండి మద్యంవిక్రయాలు ఉండరాదని స్పష్టం చేశారు.
ఈవీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, అదనపు పోలీసు సూపరింటెండెంట్ డా. ఓ. దిలీప్ కిరణ్, ఎన్నికల నోడల్ అధికారులుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img