ఉన్నతపాటశాల విధ్యార్ధుల వినతి
విశాలాంధ్ర, గరుగుబిల్లి/పార్వతీపురం; మన్యం జిల్లాలో గరుగుబిల్లిమండలంలోని తోటపల్లి హైస్కూలుకి వెళ్ళేదారిలో బహిరంగ మల విసర్జన చేస్తుండడం వలనచాలా ఇబ్బంది పడుతున్నామని గౌరీపురం, తోటపల్లి గ్రామాలకు చెందిన విద్యార్ధి,విద్యార్థినిలు స్థానిక పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. సోమవారంనాడు వారంతా సచివాలయంకువెల్లి తమ గోడును వెళ్ళబుచ్చారు
కిలోమీటరు పొడవునా దుర్గంధం వ్యాపించడంతో ముక్కులుమూసుకొని వెళ్ళవలసి వస్తుందని, ఇంటింటికీ మరుగుదొడ్లు ఉన్నప్పటికీ బహిరంగంగా, అదీ రహదారిమీద మలవిసర్జనచేయడం అనాగరిక చర్యను, దీనిని నిర్మూలించాలని కోరారు. సచివాలయం ముందు కొంతసేపు బైటాయించారు.
ఈకార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మంచిపల్లి శ్రీరాములు, ఉన్నతపాటశాల ప్రధానోపాధ్యాయులు మువ్వల వెంకటరమణ, జట్టు ట్రస్ట్ ముఖ్య సలహా దారులు డాక్టరు డి. పారినాయుడు, పాటశాల కమిటీ అధ్యక్షుడు కొల్లి జంగమయ్య తదితరులుపాల్గొన్నారు. విధ్యార్థులు పంచాయతి కార్యదర్శి శ్రీని వాసరావు కి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.