Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కోటసీతారాంపురంలో అగ్నిప్రమాదం

విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని కోట సీతారాంగ్రామంలో బుదవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో గ్రామంలోని రెడ్డి కాశింనాయుడుకుచెందిన 60 ధాన్యం బస్తాలు,యామలపల్లి అప్పారావుకు చెందిన 45 బస్తాలు,యామాలపల్లి ప్రసాదుకుచెందిన ఆరుబస్తాలధాన్యం పూర్తిగా కాలిపోయాయి. వీటివిలువ 90వేల రూపాయల ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో పాటు ఆరుగురు రైతులకు చెందిన 10గడ్డి కుప్పలు దగ్దమయ్యాయి. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల నష్ట పోయామని రైతులు తెలిపారు. రైతుల పశువులకు మేతకోసం ఉంచిన గడ్డివాములు కాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. బొబ్బిలి నుండి అగ్నిమాపక సిబ్బంది విచ్చేసి మంటలను అదుపు చేశారు. సంఘటన జరిగిన సమాచారం అందుకున్న సీతానగరం ఎస్ ఐ నీలకంఠం, సర్పంచ్ ఉడమల జయలక్ష్మీ, ఎంపీటీసీ యాల్ల అరుణ కుమారి తదితరులతోపాటురెవెన్యూ పర్యవేక్షకులు పొట్నూరు కరుణాకర్, గ్రామ రెవెన్యూ అధికారి చుక్క ఉదయ్, వ్యవసాయ సహాయకుడు వాసు తదితరులు సందర్శన చేశారు.రైతుల అవేదనను మండల వ్యవసాయ అధికారి అవినాష్,తహశీల్దార్ ఎన్వీ రమణ దృష్టిలో పెట్టగా జాయింట్ డైరెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img