Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సీతంరాజు సుధాకర్ కు మొదటి ప్రాధాన్యతఓటు వేయండి

విశాలాంధ్ర,సీతానగరం:ఉత్తరాంధ్ర పట్టభద్రుల వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సీతంరాజు సుధాకర్ కు మొదటిప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని సీతానగరం మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు పిలుపునిచ్చారు.గురువారం పలు మండల కమిటీ, గ్రామ కమిటీ నాయకులు గ్రామాల్లో పట్టభద్రుల ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. గతవారంరోజులుగా ఎమ్మెల్యే జోగారావు, పార్టీ ఆదేశాలు మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో వైఎస్సార్సీపీ మండల, గ్రామకమిటీల నాయకులు,కన్వీనర్లు, పిఓసిలు ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
పార్టీ అదేశాలు మేరకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.తనతో పాటు మాజీ జెడ్పి ఛైర్మన్, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వాకాడ నాగేశ్వర రావు,ఎంపిపి ప్రతినిథి బలగ శ్రీరాములు నాయుడు, జెడ్పీటీసీ బాబ్జి, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు పోల ఈశ్వరనారాయణ,నాయకులు కొట్నాన రత్నాకర్, తెంటు వెంకటఅప్పలనాయుడు, అంబటి కృష్ణం నాయుడు,ఆర్వీ పార్థసారథి, బుడితి గౌరునాయుడు, దాసరి నాగరత్నం,సురేష్, ఆర్వీ కిషోర్ ,సర్పంచులు, ఎంపీటీసీలు,కన్వీనర్లు,నాయకులు అభిమానులు,పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇదిలాఉండగా పెదభోగీలి మేజర్ గ్రామపంచాయతీలో ఎంపీటీసీలు ఎస్ కిరణ్, బురిడి సూర్యనారాయణ, కూర్మారావు,రమేష్, పిల్లి సతీష్, ఆర్వీ కిషోర్,సురేష్, రామారావులు తదితరులు ప్రచారాన్ని నిర్వహించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సవరపు జయమని భర్త సవరపు రామారావు మాస్టారూ, మాజీ ఎంపిటిసి మాదవ్ లు ఇంటింటికి వెళ్లి సుధాకర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏదిఏమైనా నియోజక వర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారహోరు జోరుగా కొనసాగుతుంది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img