Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నూతన కార్యవర్గం ఏర్పాటు


విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కళాజ్యోతి సమావేశ మందిరము నందు శ్రీ సత్యసాయి జిల్లా సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణ నూతన కార్యవర్గాన్ని జిల్లా సామాజిక సమరసత వేదిక కన్వీనర్ గడ్డం వాసుదేవయ్య ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షుడు గీతా గోపాల్, ప్రధాన వక్తగా పులిచెర్ల వేణుగోపాల్ ఈ సంస్థ గురించి వివరించారు. నూతన కార్యవర్గంలో పట్టణ అధ్యక్షులుగా ఎస్. శ్రీనివాసులు, కార్యదర్శిగా సి. నాగరాజు సహకార దర్శిగా పులిచెర్ల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా కుమారి బాల త్రిపుర సుందరి, బీమి శెట్టి కృష్ణమూర్తి ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. అనంతరం నూతన కార్యవర్గం వారు మాట్లాడుతూ సామాజిక సమరసత వేదిక అభివృద్ధికి తాము కృషి చేస్తామని తెలిపారు. అనంతరం వాసుదేవయ్య, కేతా గోపాల్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img