విశాలాంధ్ర,పార్వతీపురం/ సీతంపేట : మణ్యం జిల్లాలోని పాలకొండ నియోజక వర్గంలోని సీతంపేటమండలంలో మండ సచివాలయంపరిధిలో నారాయణగూడ, మండదీసరగూడ, మండకాలనీ, జాతాపు మండ, రాయమాను గూడగ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పాలకొండ శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి అధ్వర్యంలో శనివారం జరిగింది. ఆయాగ్రామాల్లో గడప గడపకు వెళ్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే కళావతి వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.