విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని గాదెలవలస గ్రామపంచాయితీలలో గురువారంనాడు గడప_గడపకు మనప్రభుత్వ కార్యక్రమం జరిగింది.ఎమ్మెల్యే జోగారావు గ్రామంలోని ప్రతీలబ్దిదారునిఇంటికి అధికారులు, ప్రజా ప్రతినిధులు,సచివాలయఉద్యోగులు, వాలుంటీర్లుతో కలిసివెళ్ళి ప్రభుత్వం వారికి చేకూర్చిన ప్రయోజనాలను, గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరించారు. వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. గత మూడేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులు తెలియజేసి, ఇంకాఏమిచేయాలని అడుగుతూ ముందుకు సాగారు.ప్రతీ ఇంటివద్ద కుశల ప్రశ్నలను వేసి వారి సమస్యకు పరిష్కారాన్ని చూపడం గమనార్హం. ఈకార్యక్రమంలో ఎంపిపి బలగ రవనమ్మ, జెడ్పీటీసీ బాబ్జి, వైస్ ఎంపిపి సూర్యనారాయణ, నాయకులు బొంగు చిట్టిరాజు, శ్రీరాములునాయుడు, పోలఈశ్వర నారాయణ, వెంకట అప్పల నాయుడు, సర్పంచులు బొన్నాడ తిరుపతిరావు, పోల తిరుపతిరావు, నమ్మి దుర్గ,శివ, అచ్యుత, తదితర నాయకులతో పాటు ఎంపిడిఓ బికృష్ణమహేష్ రెడ్డి, తహశీల్దార్ ఎన్వీ రమణ, మండల పరిషత్తు పరిపాలన అధికారి ప్రసాద్, ఈఓపిఅర్డి వర్మ,ఏపిఓ నాగలక్ష్మి, గృహనిర్మాణ శాఖ జేఈ జానకీరాం, వెలుగు ఏఎంపి శ్రీరాములు, అర్ డబ్ల్యు ఎస్ జేఈ పవన్ కుమార్, ఎంఈఓ సూరిదేముడు, మండల వ్యవసాాయాధికారి అవినాష్,కార్యదర్శులు శశిభూషణ్,రిజ్వాన్, సాయి ప్రియాంక, గ్రామ రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, సచివాలయంసిబ్బంది, మండలప్రజా ప్రతినిధులు,నాయకులు, వాలంటీర్లు,
గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వర్షం కురుస్తున్న కార్యక్రమం నిలిపివేయకుండా ఎమ్మెల్యే కొనసాగించారు.