డిఆర్డీఎ ప్రోజెక్టు అధికారి కిరణ్ కుమార్
విశాలాంధ్ర,పార్వతీపురం : రాయితీపై మత్స్య యూనిట్లు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్ తెలిపారు. రాయితీపై మత్స్య యూనిట్లు ఏర్పాటుపై స్థానిక జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారంనాడు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈసమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం క్రింద ఎస్సీ ఎస్టీలమహిళలకు విలువ ఆధారిత మత్స్య యోజన యూనిట్లు 60 శాతం రాయితీపై మంజూరుకు అవకాశం ఉందన్నారు. ఇతరులకు 40 శాతం మాత్రమే రాయితీ లభిస్తుందన్నారు. ఆహారశుద్దిసొసైటీ క్రింద అదనంగా 35 శాతం రాయితీ లభిస్తుందని చెప్పారు.
ఈపథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని, మంచి ఆహారం తక్కువ ధరకు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతు అధిక ఆదాయం పొందుటకు మంచి అవకాశం అన్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన క్రింద ఫిష్ కియాస్క్ లను రూ.10 లక్షల వరకు, ఇతర యూనిట్లు 20 నుండి 50 లక్షల రూపాయలవరకు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఆయనతో పాటు పలువురు జిల్లాఅధికారులు, వెలుగు మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.