Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఘనంగా వైయస్అర్ వర్ధంతి

అన్నసంతర్పణ, వైఎస్సార్ పించన్లు పంపిణికార్యక్రమాలు నిర్వహణ

విశాలాంధ్ర,పార్వతీపురం/సీతానగరం :దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 13వవర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్వతీపురం నియోజక వర్గంలోని పార్వతీపురం పురపాలక సంఘం,పార్వతీపురం,సీతానగరం,
బలిజిపేట, మండలకేంద్రంలలో, పలు గ్రామాల్లోఎమ్మెల్యే జోగారావు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వైఎస్సార్ విగ్రహానికి వైసీపీశ్రేణులతో కలిసి ఎమ్మెల్యే అలజంగి జోగారావు పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు.సీతానగరంలో ఎంపిడిఓ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్ అమర రహే అంటూ నినాదాలు చేశారు. రాజశేఖర రెడ్డి సేవలను కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత అప్పట్లో రాజశేఖర రెడ్డి అమలు చేయగా నేడు జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈసందర్భంగా ఇటీవల మండలానికి కొత్తగా మంజూరైన డప్పు, చర్మకారుల పించన్లను ఆయాగ్రామాల ప్రజాప్రతినిదులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నాయకులసమక్షంలో పంపిణి చేశారు.అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంబించి పలువురుకి వడ్డన చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి బలగ శ్రీరాములు నాయుడు, జెడ్పీటీసీ బాబ్జీ, మాజీ జెడ్పీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, ఆర్వీ, పోల ఈశ్వర నారాయణ, కృష్ణంనాయుడు, రత్నాకర్, పెదబోగీలి నాయకులు గౌరీ కిరణ్,సూర్యనారాయణ,అరవింద్, పిల్లి సతీష్, యూ సురేష్,రమేష్,వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులుపాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img