Friday, April 19, 2024
Friday, April 19, 2024

గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి

విశాలాంధ్ర,సీతానగరం : జగనన్న లే అవుట్ లో గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టరు లక్ష్మీశా అన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాల ప్రగతిని పరిశీలించడానికి lజిల్లాకు విచ్చేసిన ఆయన మండలంలోని కాసాపేటలో ఇళ్లనిర్మాణంను తనిఖీ చేశారు. ప్రారంభంకాని ఇళ్లనిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పునాదులస్థాయి, లింటల్ స్థాయి, రూఫ్ స్థాయిలోఉన్న గృహాల నిర్మాణం ప్రతీవారం పురోగతి సాధించాలనిసూచించారు. విద్యుత్ స్తంభాలు వేసినప్పటికీ, విద్యుత్ కనెక్షన్ లేదని లబ్ధిదారులు తెలియజేయగా వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. రఘురాం మాట్లాడుతూ ఇక్కడ
8గృహాలు పూర్తయ్యాయని, 26 గృహాలకు స్లాబ్ వేయాలని వివరించారు. మొత్తం 59 గృహాలు నిర్మాణం జరుగుతోందని వివరించారు.ఈకార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ డిఇ ప్రసాద్,ఏఈ
జానకీరాం, వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సెక్రటరీ మురళి, సిబ్బంది లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img