Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లచ్చయ్యపేటలోఇదేంఖర్మ-మనరాష్ట్రానికి కార్యక్రమం నిర్వహణ

విశాలాంధ్ర – సీతానగరం:మండలంలోని లచ్చయ్యపేటగ్రామంలో ఇదేంఖర్మ -మన రాష్ట్రానికి కార్యక్రమంను టీడీపినియోజక వర్గఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు ఆద్వర్యంలోబుధవారం సాయంత్రం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి గతమూడున్నర ఏళ్లలో వైఎస్సార్సీపీ ఆన్నివిధాలుగా వైపల్యం చెందిందని తెలిపారు.నిరుద్యోగం, ఆడబిడ్డలకు భద్రత ఏది, బాదుడే బాదుడు, మద్యాంద్ర ప్రదేశ్, ఊసేలేని అభివృధ్ధి, కానరానిరోడ్లు, ఇసుక ఇక్కట్లు, ఏపీరాజదాని ఏది?, అనకొండలా అవినీతి, షాక్ కొట్టించే కరెంటుధరలు, గిట్టనిగిట్టుబాటుధరలు తదితర అంశాలపై ప్రభుత్వ వైపల్యాలను వివరించారు. బిసి లకు అన్నివిధాలుగా అన్యాయం చేసిన వైఎస్సార్సీపీ ఇప్పుడు జయహో బిసి సదస్సు ఏర్పాటు విడ్డూరంగా ఉందన్నారు. టిడిపినాయకులు ఇదేం ఖర్మ గోడపత్రికలు ప్రతీ ఇంటివద్ద అందజేసి ప్రభుత్వ వైపల్యాలను వివరించారు. ఈకార్యక్రమంలో టీడీపీ నేతలు గర్భాపు ఉదయభాను, మండల టిడిపి అధ్యక్షుడు కొల్లితిరుపతిరావు, ప్రధానకార్యదర్శి రౌతు వేణుగోపాలనాయుడు, నాయకులు గొట్టాపు వెంకటనాయుడు బోనుచంద్రమౌళి, వంజరాపుగుంపస్వామి, శ్రీరాములు నాయుడు,పైల నాగభూషణరావు, సాలా హరి, గరికయ్య, బుడితి శ్రీను, వెంకటనాయుడు, పెంట సత్యం నాయుడు, బొమ్మినాయని లక్ష్మణ, పెంట ఉమా,సింహాచలంనాయుడు, బొత్స వెంకటనాయుడు, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img