Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బైరిపురంగ్రామంలోఇదేంఖర్మ

మనరాష్ట్రానికి కార్యక్రమంనిర్వహణ
విశాలాంధ్ర, సీతానగరం: బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామ పంచాయతీలోని బైరిపురం గ్రామంలో ఇదేంఖర్మ -మన రాష్ట్రానికి కార్యక్రమంను టీడీపినియోజక వర్గఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు ఆద్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి గతమూడున్నర ఏళ్లలో వైఎస్సార్సీపీ ఆన్నివిధాలుగా వైపల్యం చెందిందని తెలిపారు.నిరుద్యోగం, ఆడబిడ్డలకు భద్రత ఏది, బాదుడే బాదుడు, మద్యాంద్ర ప్రదేశ్, ఊసేలేని అభివృధ్ధి, కానరానిరోడ్లు, ఇసుక ఇక్కట్లు, ఏపీరాజదాని ఏది?, అనకొండలా అవినీతి, షాక్ కొట్టించే కరెంటుధరలు, గిట్టనిగిట్టుబాటుధరలు తదితర అంశాలపై ప్రభుత్వ వైపల్యాలను వివరించారు. టిడిపినాయకులు ఇదేం ఖర్మ గోడపత్రికలు ప్రతీఇంటివద్ద అందజేసి ప్రభుత్వ వైపల్యాలను వివరించారు. ఈకార్యక్రమంలో బలిజపేట మండలం తెలుగుదేశంఅధ్యక్షులు పెంకి వేణుగోపాల్ నాయుడు, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకటనాయుడు, నియోజక వర్గంనేత వాడాడ రాము, అరకు పార్లమెంట్ కార్యదర్శి మజ్జి అప్పారావు, క్లస్టర్ ఇంఛార్జులు సాదు రామారావు,గుళ్ళ బాబ్జీ, విశ్వేశ్వరరావు సర్పంచ్ దూడి భాస్కరరావు, రైతు అధ్యక్షులు క్రిష్ణ మూర్తినాయుడు, మాజీ సర్పంచులు సాలిల రామారావు, తిరుపతి నాయుడు, మరిశర్ల చిన్నంనాయుడు,శెట్టి అప్పలనాయుడు ,తెలుగు యువత నాయకులు అలమండ వెంకట రమణ , పార్వతీపురం మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బోను దేవిచంద్రమౌళి, వై ఏ నాయుడు, కొవ్వాడ శ్రీనివాస్, బోగ రామారావు, పైడిరాజు,దామోదర సత్యం నాయుడు, గుళ్ళ సింహాచలం, శ్రీనువాసు రావు, శివకుమార్ , పార్వతీపురం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు శ్రీను,సత్యం, మండలం తెలుగుదేశం పార్టీనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img