విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని చినభోగిలి గ్రామంలో సోమవారంనాడు జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో భాగంగా డ్రోన్లుతో భూసర్వే నిర్వహించారు. డ్రోన్లు ఎగురవేసి భూమిని, హద్దులను పరిశీలించారు. గ్రామాల్లో భూసమస్యల పరిష్కారంకోసం ఈసర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని తహశీల్దార్ ఎన్వీ రమణ చెప్పారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ కురమాన శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ రమేష్, గ్రామపెద్దలు, రెవెన్యూ, సర్వే అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.