పశువైద్యఅధికారులు దీనకుమార్, రామారావులు పిలుపు
విశాలాంధ్ర,సీతానగరం: పశువులలో వస్తున్న బొబ్బవ్యాధి నివారణకు ముందస్తు వ్యాధినివారణ టీకాలు వేస్తున్నట్లు పశువైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టరు దీనకుమార్, మండల పశువైధ్యాధికారి సిరిపురపు.రామారావులు తెలిపారు. శనివారం అప్పయ్యపేటగ్రామంలో జరిగిన టీకాలకార్యక్రమంలో వారుపాల్గొన్నారు. ఈసందర్భంగా వారుమాట్లాడుతూ ఇటీవల ఉత్తరాదిరాష్ట్రాలలో పశువులలో బొబ్బవ్యాధి వ్యాప్తిచెంది పశుసంపదకు నష్టం కలిగించడంతో మనప్రభుత్వం ముందస్తుజాగ్రత్తలు తీసుకుని టీకాలు వేస్తుందని చెప్పారు.మండలానికి మొదటి విడతగా 15వందల డోసులు ఇవ్వగా సూరమ్మపేట, మరిపివలస, అప్పయ్య పేట, కాసాపేట, చినభోగిలి, రంగమ్మపేట తదితర గ్రామాల్లో పశువులకు వేయడం జరిగిందని చెప్పారు. అన్నిగ్రామాలలో పశువైద్య అసిస్టెంట్లు అధ్వర్యంలో టీకాలు వేస్తున్నారని చెప్పారు. బొబ్బవ్యాధి లక్షణాలను తెలియజేస్తూ పశువుల శరీరం నిండా బొబ్బలు ఉంటాయని, అవిపగిలి చీముకారడం, వెన్నుపూస మీద ఏర్పడితే పక్షపాతం రావడం,పశువులకు తీవ్రమైన జ్వరంరావడం, ఆకలిలేకపోవడం, పాల దిగుబడితగ్గడం, చూడిపశువులలో రక్త స్రావం జరగడం, మరణాలు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. పశు సంపదపై రైతులు తగుజాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆయనతోపాటు విఏలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.