Friday, April 19, 2024
Friday, April 19, 2024

టిడిపి పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం

విశాలాంధ్ర – పార్వతీపురం : స్థానిక టీడీపీ పార్టీకార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని మంగళవారం నిర్వహించారు.జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. రఅటువంటి మహనీయుల ఆలోచనలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి టిడిపి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు. ఈకార్యక్రమంలో టీడీపీ నియోజక వర్గ ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు,మాజీ ఏఎంసి చైర్మన్ రెడ్డి శ్రీనివాసరావు, అరకుపార్లమెంటు ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకటనాయుడు, పట్టణపార్టీ అధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్,మండలపార్టీ అధ్యక్షులు దొగ్గ మోహనరావు,ఉదయభాను, సీతానగరం పార్టీ అధ్యక్షులు కొల్లి తిరుపతిరావు, కోలా బాబు, తాతపూడి వెంకటరమణ, బడే గౌరునాయుడు, బోను దేవీచంద్ర మౌళి, నారాయణరావు, కెంగువ సుధీర్, బంకపల్లి రవికుమార్, కోలా వెంకటరావు, సిరిపురపు భాస్కరరావు, తాన్న ప్రసాద్, గొంగాడ రామమూర్తి,  మరిశర్ల కార్తీక్ నాయుడు, శంబంగి తిరుపతిరావు, బేత లక్ష్మణరావు, మరియదాస్, జాగాన రవిశంకర్  తదితరులు పాల్గొన్నారు.
నేడు టీడీపీ క్లస్టర్ యూనిట్ ఇంచార్జిల సమావేశం: స్థానిక పార్టీ కార్యాలయంలో బుదవారం నాడు క్లస్టర్ యూనిట్ ఇన్ చార్జీలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నియోజక వర్గం ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు తెలిపారు.ఈసమావేశానికి తనతోపాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శాసనమండలి మాజీ సభ్యులు ద్వారపురెడ్డి జగదీష్,నియోజకవర్గ పరిశీలకులు బోయిన గోవిందరాజులు పాల్గొంటున్నందున తప్పనిసరిగా నియోజక వర్గంలోని క్లస్టర్ ఇంచార్జిలు మాత్రమే హాజరు కావాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img