విశాలాంధ్ర – సీతానగరం: మండలంలోని గెడ్డలుప్పి కూడలిలోఉన్న కృషి విద్యా నికేతన్ లో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని మంగళవారం నిర్వహించారు.జ్యోతిరావు పూలే చిత్రపటానికి కరెస్పాండెంట్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు,సిబ్బంది, విధ్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. ఈకార్యక్రమంలో సిబ్బంది, విధ్యార్థులు పాల్గొన్నారు.