Friday, April 19, 2024
Friday, April 19, 2024

వినాయక మట్టి ప్రతిమలు పంపిణి చేసిన ఎమ్మెల్యే జోగారావు

విశాలాంధ్ర,సీతానగరం: మానవులకు ఉండే విఘ్నాలను తొలగించుకునేందుకు ప్రతీఒక్కరు విఘ్నేశ్వరుడిని పూజించి ముక్తిని పొందాలని పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. మంగళ వారం మండలకేంద్రములో పెదబోగిలి మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ ఎల్ అరవింద్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేయి మట్టి వినాయక ప్రతిమలను అయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ప్రతీ ఏటా ఎల్ వి ఆర్ సేవా సంస్థ అధ్యక్షులు,ఉప సర్పంచ్ అరవింద్ చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించారు. పర్యావరణ కాలుష్యము నివారించుటకు మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను పూజించాలని కోరారు. హిందువుల మొదటి పండుగ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి నాగేశ్వరరావు, ఎంపిపి బలగ శ్రీరాములు నాయుడు,జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, మండల పార్టీ అధ్యక్షులు  బొంగు చిట్టిరాజు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి ఈశ్వరనారాయణ, సర్పంచ్ తేరేజమ్మ, ఎంపీటీసీలు గౌరీ కిరణ్, బురిడి సూర్యనారాయణ నాయకులు ఆర్వీ, సవరపు రామారావు,ధనం,రత్నాకర్,రామారావు, సాలాహరి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు,స్థానికప్రజలు తదితరులు  పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img