విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని లక్ష్మిపురం గ్రామ పంచాయతీలోని పంపు హౌసుని ఎంపిడిఓ కృష్ణ మహేశ్ రెడ్డి,
ఈఓపిఆర్డీ వర్మలు గురువారం సందర్శింఛారు ఇటీవల ఒక గ్యాస్ బండనుండి క్లోరిన్ గ్యాస్ లీకయిన కారణాన్ని పరిశీలించి వాటిని ఆర్ డబ్ల్యు ఎస్ జేఈ పవన్ కుమార్ నివాటిని సురక్షితంగా గ్యాస్ లీకేజీ లేకుండా చేయవలసినదిగా కోరారు. అనంతరం గ్రామ సచివాలయంను సందర్శించి రికార్డు లుపరిశీలించి ప్రతీవలంటీరు తమకు సంబంధించిన గృహాలనుండి డేటాను సేకరించి సచివాలయం కంప్యూటర్లలో క్రోడీకరించి వుంచవలసినదిగా ఆదేశించారు. సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైనలబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు