తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు కొన సాగాలి: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
విశాలాంధ్ర,పార్వతీపురం: తెలుగు భాషాభిమానిగా మాతృభాష తెలుగును మన్యం జిల్లాలోని శతశాతం అమలుకు కృషిచేయాలని, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే కొనసాగించాలని రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను కోరారు.గురువారం జిల్లాపర్యటనకు విచ్చేసిన రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షులను జిల్లా కలెక్టర్ మర్యాద పూర్వకంగా ముందుగా కలిసారు.అనంతరం కలెక్టర్ కార్యాలయంలో తెలుగుభాష అమలుపై సమీక్ష సమావేశంను యార్లగడ్డ నిర్వహించారు.జిల్లాలో అధికారభాష అమలుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. భాషాభిమానిగా అన్నిశాఖల ఉత్తర ప్రత్యుత్తరాలులో శతశాతం జారీ చేయుటకు, ప్రజల్లో అధికారభాషను పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. అధికార భాషను పూర్తి స్థాయిలో అమలుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఈసందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ సంధర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషను పాలనా భాషగా అమలుకు చర్యలు చేపట్టిందని అధ్యక్షులు తెలిపారు. తెలుగు భాషను అమలు చేయనివారికపై చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా ఒక నియమావళిని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని ఆయన వివరించారు. నియమావళి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. మాతృ భాషపై మమకారం ఉండాలని, దానిని పరిరక్షించు కోవాలని ఆయన కోరారు. ఉత్తరాంధ్ర గురజాడ, గిడుగు, రోణంకి తదితర గొప్ప పండితులకు నిలయమైన ఉత్తమ ఆంధ్రాగా అభివర్ణించారు. పి.వి. నరసింహా రావు, జలగం వెంగళరావు, ఎన్.టి.ఆర్, వై.ఎస్.ఆర్ వంటి అప్పటి ముఖ్య మంత్రులు తెలుగు భాషకు కృషి చేశారని, ప్రస్తుత జగన్ మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో తెలుగు భాష అమలుపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని అమలు చేస్తానని కలెక్టర్ నిశాంత్ కుమార్ హామీ ఇచ్చారు.
ఈకార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, జిల్లాలోని అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.