అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడి
విశాలాంధ్ర,సీతానగరం: రెండు జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లు పరిదిలో దొంగతనాలకు పాల్పడిన మరిపిగోవిందరావు అలియాస్ గౌతంను శుక్రవారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు పార్వతీపురం మన్యంజిల్లా అదనపుఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు.శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ నీలకంఠంతోకలిపి విలేకరుల సమావేశంను ఆయన నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న గోవిందరావు పార్వతీపురంమండలంలోని పిన్నింటిరామినాయుడువలస
గ్రామానికి చెందినవాడని చెప్పారు.ఇతను ఇంటర్మీడియట్ వరకు చదువుకొని
ప్రస్తుతం వెల్డింగ్ పనులు చేసుకుంటున్నాడని,చెడువ్యసనాలకు బానిసై, అక్రమమార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు అలవాటుపడ్డాడని చెప్పారు. గతంలో ఇతడు పార్వతీపురంటౌన్,
విజయనగరం 1టౌన్,విజయనగరం
2టౌన్, సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం మరియు మోటార్ సైకిలు దొంగతనాలకు పాల్పడి
జైలుకి వెళ్లివచ్చినట్లు తెలిపారు. మరలా ఎల్విన్ పేట, బొబ్బిలి,
రాజాం, బాడంగి,
పెదమానాపురం, సీతానగరం పోలీస్ స్టేషన్స్ పరిదిలలో మొత్తం 10 మోటర్
సైకిళ్లని (హీరో మోటార్ సైకిల్స్-7, సీడి డీలక్స్-1, యమహా-1
యునికార్న్-1 మోటర్ సైకిల్) దొంగతనంచేసాడని చెప్పారు. ఆయనపై ఆయా స్టేషన్లో కేసులు ఉన్నాయని చెప్పారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో సీతానగరం రైల్వే జంక్షన్ వద్ద వాహనాలను
ఎస్ ఐ నీలకంఠం అధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చెకింగ్ చేస్తుండగా అతడు పట్టుబడినట్లుచెప్పారు. దర్యాప్తుజరిపి మరిపి గోవిందరావును అరెస్ట్ చేసి సంబంధిత రికార్డులతో కోర్టులో
జ్యూడిషియల్ కస్టడీ నిమిత్తం హాజరు పరుస్తున్నామని చెప్పారు. వివిధ కేసుల్లో వాహనాల దొంగగాఉన్న గోవిందరావును పట్టుకున్న సాలూరు సీఐ సిహెచ్ శ్రీనివాస రావు, ఎస్ ఐ నీలకంఠం,సిసిఎస్ ఎస్ఐలు చినరాజులు,సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఉదయ్, నారాయణరావు, శ్రీనివాసరావు ,రామకృష్ణ, జి రామకృష్ణలను ఆయన అభినందించారు.