Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇసుక తవ్వకాలకు జె పీ వి ఎల్ సంస్థకు అనుమతి

జిల్లా ఎస్పీ విద్యాసాగర్

విశాలాంధ్ర,పార్వతీపురం:రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు మెస్సర్స్
జయప్రకాశ్  వర్ వెంచర్స్ లిమిటెడ్ (జెపివిఎల్) సంస్థకుటెండర్ల ద్వారా అనుమతి వచ్చిందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మంగళ వారం రాత్రి ఆయన పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు.
జెపివిఎల్ సంస్థ అనుమతించిన వ్యక్తులకు మాత్రమే రాష్ట్రంలో ఇసుక విక్రయాలను నిర్వహించేందుకు అనుమతి ఉందని,ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా ఇతర పేర్లతో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు . కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్ లు పొందామని, జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఇప్పటికే జెపివిఎల్ పత్రికాప్రకటన ద్వారా ఖండించిందనిచెప్పారు. అలా ఎవరైనా ప్రచారం చేసుకున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా జెపివిఎల్ పోలీస్ శాఖనుకోరడం జరిగిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img