ఎస్ ఇ నీలకంఠం
విశాలాంధ్ర,సీతానగరం: మహిళలు వాడే ప్రతీ ఆండ్రాయడ్ సెల్ ఫోన్లో దిశ యాప్ నమోదు చేసుకొని భద్రత పొందాలని సీతానగరం ఎస్ ఐ నీలకంఠం తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు మేరకు సీతానగరం రాష్ట్రీయ రహదారిపై పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులతో కలిసి దిశ యాప్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే అన్ని గ్రామాలలో 75శాతం నమోదు చేయడం జరిగిందన్నారు. మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. వారు ఆపదలో ఉన్న సమయంలో దిశ యాప్ వల్ల రక్షణ కల్పించడానికి అవకాశం వుంటుందని తెలిపారు. మహిళలతో పాటు అందరూ వాడే సెల్ ఫోన్లో దిశ యాప్ నమోదు చేసుకొని సహకారాన్ని అందించాలని కోరారు. ప్రతీ రోజు వాహనాలు తనిఖీతో పాటు దిశ యాప్ నమోదు కార్యక్రమం నిర్వహించి దీని ప్రాధాన్యతపై మహిళలకు, వారితో కలిసి ప్రయాణం చేసిన వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
సచివాలయాల్లో మహిళ పోలీసులు, గ్రామవాలంటీర్లు దిశ యాప్ నమోదును ఎప్పటికప్పుడు చేస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం ఆటో వాహన డ్రైవర్లకు అవగాహనను కల్పించి, వాహనాలు నడిపే సమయంలో రోడ్డు నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలని తెలిపారు. నిర్ణీత ప్రయాణికులతో వెల్లి రోడ్డు ప్రమాదాలు నివారణకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వాహనదారులు రోడ్డు నియమాలను పాటిస్తూ తప్పనిసరిగా ఆన్నిదృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలిపారు. గతంలో విధించిన అపరాధ రుసుంలు తప్పని సరిగా చెల్లింపు చేయాలనీ కోరారు. ఆయనతో పాటు ఏఎస్ఐ నాయుడు, హెచ్ సి లావణ్య, పద్మ, తిరుపతి తదితరులతో పాటు 20గ్రామ సచివాలయాల మహిళాపోలీసులు పాల్గొన్నారు.