తహశీల్దార్ షేక్ ఇబ్రహీం
విశాలాంధ్ర, సీతానగరం:మండలములోని పలు గ్రామాలలో డ్రోన్లతో రీసర్వే కార్యక్రమంను రెవెన్యూ,సర్వే,
సచివాలయఅధికారులు ముమ్మరంగా చేస్తున్నారు.రాష్ట్ర కమీషనర్ ఆదేశాలతో పాటు జిల్లా కలెక్టరు నిషాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆనంద్, డి ఆర్ ఓ వెంకటరావు, సబ్ కలెక్టర్ భావన ఆదేశాలుమేరకు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకంక్రింద ఎంపిక చేసిన గ్రామాల్లో
రీసర్వే ముమ్మరంగా జరుగుతున్నదని తహశీల్దార్ షేక్ ఇబ్రహీం తెలిపారు. మొదటి ,రెండవ విడతల్లో ఎంపిక చేసిన 30గ్రామాలకు గాను ఇంతవరకు 20గ్రామాల్లో పూర్తి చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బందికి సూచనలు ఇస్తూ వేగవంతంగా పూర్తిచేయాలని కోరుతున్నట్లు చెప్పారు. రైతులు, ప్రజా ప్రతినిదులు పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు.
పలు గ్రామాల్లో రీసర్వేపనులు జరుగుతున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆయాగ్రామాలలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామసర్వేయర్లుతో పాటు విఆర్ఏలు ఆయాగ్రామాలలో ఉండి త్వరితగతిన పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శుక్రవారం జోగమ్మపేట గ్రామంలో నిర్వహించారు.ఆయనతోపాటు మండల రెవెన్యూ పర్యవేక్షకుడు రాజేష్, మండల సర్వేయర్, విఆర్ఓలు,పంచాయతీ కార్యదర్శిలు, సర్వేయర్లు, ప్రజాప్రతినిదులు,రైతులు, వాలంటీర్లు,నాయకులు,పాల్గొన్నారు.