Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

జిల్లా ఇంఛార్జి బి.సి సంక్షేమఅధికారిగా సాంబయ్య

విశాలాంధ్ర,పార్వతీపురం : జిల్లా ఇంచార్జి బి.సి సంక్షేమ అధికారిగా ఎస్.సాంబయ్య శుక్ర వారం బాధ్యతలు చేపట్టారు. సాంబయ్య వార్డెన్ గా పనిచేస్తూ పార్వతీపురం సహాయ బి.సి. సంక్షేమశాఖాధికారిగా పని చేస్తున్నారు. శుక్రవారం ఇన్ ఛార్జ్ జిల్లా బి.సి.సంక్షేమ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇన్ ఛార్జ్ బాధ్యతలు నిర్వహించిన ఎస్.కృష్ణ పాలకొండ సహాయ బి.సి.సంక్షేమ అధికారిగా, శ్రీకాకుళం జిల్లా బిసి సంక్షేమ శాఖాధికారిగా చేరారు. కొత్తగా చార్జి తీసుకున్న సాంబయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. కస్టపడి పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృషి చేస్తానని సాంబయ్య తెలిపారు. సాంబయ్యను మన్యం జిల్లాలోని పలువురు వార్డెన్లు కలిసి అభినందనలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img