Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జిల్లాఎస్పీ ఆధ్వర్యంలో “స్పందన”

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆద్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లాఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టరు ఒ. దిలీప్ కిరణ్, ఎస్ బి. సి.ఐ. శ్రీనివాసరావు, డిసిఆర్బి సిఐ ప్రభాకరావు , ఎస్ఐ దినకర్లు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img