Friday, April 19, 2024
Friday, April 19, 2024

విద్య‌తోనే ఉన్న‌త స్థానం

ఎస్ ఎస్ ఆర్ చారిట‌బుల్ ట్ర‌స్టు అధినేత డాక్ట‌ర్ సూర శ్రీ‌నివాస‌రావు

500 మంది విద్యార్థుల‌కు ప‌రీక్ష సామ‌గ్రి అంద‌జేత‌
విశాలాంధ్ర – పొందూరు ( శ్రీకాకుళం): విద్యతోనే ఉన్నత స్థానం అధిరోహిస్తామని, విద్య లేకపోతే వెనుకబడిపోతామని ప్ర‌తి విద్యార్థి క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన విద్య‌న‌భ్య‌సించాల‌ని ఎస్ ఎస్ ఆర్ చారిట‌బుల్ ట్ర‌స్టు అధినేత డాక్ట‌ర్ సూర శ్రీ‌నివాస‌రావు అన్నారు. పొందూరు మండ‌లంలోని లోలుగు ఎంపీయుపీ పాఠ‌శాల‌, కెజీబీవీ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న 500 మంది విద్యార్థుల‌కు అట్ట‌, పెన్నుతో పాటు ప‌రీక్ష సామ‌గ్రి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సూర శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ చిన్నప్పటి నుండి చదవడం అలవాటు చేసుకోవాలని, చదువు తోనే జ్ఞానం పెంపొందుతుందని, పుస్తకాలతో వందల వేల సంవత్సరాల నాటి మహానుభావుల అనుభవాలతో మనం ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. నిత్య విద్యార్థి అని, ఎంత నేర్చుకున్న, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందని అన్నారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, పాఠ‌శాల‌కు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాఠ‌శాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేత‌ర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img