Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

నేడు రాష్ట్ర అధికార భాషా సంఘం పర్యటన

విశాలాంధ్ర,పార్వతీపురం : రాష్ట్ర అధికార భాషా సంఘం గురువారంనాడు జిల్లాలో పర్యటిస్తుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. భాషాసంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సభ్యులు గురువారం ఉదయం10 గంటలకు జిల్లాకు చేరుకుంటుందని అయన విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలుగు భాష అమలు, తనిఖీపై అన్ని శాఖలతో సమీక్షచేస్తారని చెప్పారు. రెండో పూట పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంను సందర్శించి అక్కడ కూడా సమీక్ష చేస్తారని తెలిపారు.అధికార భాష అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత శాఖలు సిద్ధంచేయాలని ఆయన ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img