ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్
విశాలాంధ్ర, సీతానగరం: ప్రభుత్వమే నేరుగా రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేయాలని, రైస్ మిల్లర్ల దోపిడీ నుండి రైతులను కాపాడాలని కోరుతూ ఈనెల 7న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లాకార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. శనివారం మండలంలోని పలుగ్రామాల్లో రైతులను కలిసి మద్దతు కోరారు.ఈనెల 7న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంవద్ద జరుగు ధర్నాకు రైతులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.రైతు పండిన పంటను అమ్ముకో లేని దీనస్థితి రైతులకు ఉందని తెలిపారు. ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరించాలని కోరారు. ఇక్కడ చెరకును నేరుగా నేరుగా కోనుగోలు చేసేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. దాన్యం, వాణిజ్య పంటలను నిల్వ ఉంచుటకు గిడ్డంగులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మైదాన ప్రాంతాల్లోని ఏనుగులు తరలించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరుతూ నిర్వహించే చేయనున్న ధర్నాకు రైతులంతా తరలిరావాలని కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.