Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రక్తదానం చేసిన ముగ్గురు ఇంజినీరింగ్ సహాయకులు

విశాలాంధ్ర,సీతానగరం: ఇంజనీర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ముగ్గురు ఇంజినీరింగ్ సహాయకులు రక్తాన్ని దానంచేశారు. మోక్షంగుండా విశ్వేశ్వరయ్య జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఇంజినీరింగ్ అధికారి ఇచ్చిన పిలుపు మేరకు పెదబోగిలి, గెడ్డలుప్పి, లక్ష్మీపురం సచివాలయాల ఇంజినీరింగ్ సహాయకులు సంతోష్, రాజు, జగదీష్ లు రక్తాన్ని దానం చేశారు. వారిని ఎంపిడిఓ కృష్ణ మహేష్ రెడ్డి,తోటి సిబ్బంది, సచివాలయాల సిబ్బంది అభినందించారు.  

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img