Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

విశాలాంధ్ర,సీతానగరం: బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని పార్వతీపురం మండలములోని తాళ్ళబురిడి గ్రామంలో టీడీపీ నాయకులు ఆద్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తిప్రదాతని, రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తని కొనియాడారు. అంబేద్కర్ సమాజానికి దిశా నిర్దేశం చేశారన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి నేతలు గొట్టాపు వెంకట నాయుడు, బుడితి శ్రీరాములు, బేత లక్ష్మణరావు, కోట శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img