Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఏడేళ్లయినా ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?

సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల మండిపాటు
అధికారంలోకి వచ్చి ఏడేళ్లయినా యువతకు ఉద్యోగాలివ్వనందుకు సీఎం కసీఆర్‌ అవమానంతో తలదించుకోవాలని అన్ని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ మంగళవారం ఆమె వరుస ట్వీట్లు చేశారు. ‘తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు, 7 ఏండ్ల పాలనలో నోటిఫికేషన్స్‌ ఇవ్వనందుకు, డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లనురోడ్ల మీద ఛాయ్‌ అమ్ముకునేలా చేసి ఐదు, పది చదవని వాళ్లను మంత్రులు చేసినందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు, నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోనందుకు కేసీఆర్‌గారు సిగ్గుపడాలి. అవమానంతో తలదించుకోవాలి. చదువుకున్న యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు’ అంటూ షర్మిల ట్వీట్లు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img