కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు,ఆధికారులతో పంచాయితీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కరోనా విషయంలో ఎవరూ ఆందోళన పడొద్దనని, కొంచెం ధైర్యంగా ఉండాలి.. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి వారికి భరోసానిచ్చారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని,స్వీయ నియంత్రణ, సామాజిక దూరం, మాస్కులు ధరిస్తే మంచిదని చెప్పారు. ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే, తనకు గానీ, తన వద్ద పని చేసే సిబ్బందికి గానీ ఫోన్ చేయాలని కోరారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు డాక్టర్లను టెలీకాన్ఫరెన్సులోకి తీసుకుని మంత్రి వారితో మాట్లాడారు. నియోజక వర్గం ప్రజల యోగ క్షేమాలను, అందుతున్న వైద్యాన్ని, తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి ఎర్రబెల్లితో తెలుసుకున్నారు.