తెలంగాణ రాష్ట్రం రోనా వ్యాక్సిన్ పంపిణీలో మరో మైలురాయిని అధిగమించింది. గురువారం ఉదయానికి కరోనా వ్యాక్సినేషన్ 4 కోట్ల మార్కును దాటింది. అర్హులైన 95 శాతం మందికి ఇప్పటిరకు మొదటి డోసు పంపిణీ చేయగా, రెండో డోసు 50 శాతం పూర్తయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.రాష్ట్రంలో జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవ్వగా..అప్పటి నుంచి165 రోజుల్లో కోటి డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్ మరో 78 రోజుల్లోనే రెండు కోట్ల మార్కును చేరింది.నాలుగు కోట్ల మైళురాయిని దాటడానికి మరో 45 రోజుల సమయం పట్టింది.